- Advertisement -
రంగారెడ్డి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సికిందర్ సింగ్(34), అలీఖాన్ పఠాన్(30)గా గుర్తించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -