Tuesday, May 28, 2024

జోరుగా.. హుషారుగా

- Advertisement -
- Advertisement -

జోరుగా..హుషారుగా టీమిండియా క్రికెటర్లు

Indian Cricketers enjoy with families in England

సౌతాంప్టన్: సుదీర్ఘమైన సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రస్తుతం కఠినమైన క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కఠిన క్వారంటైన్‌లోనూ భారత ఆటగాళ్లు హుషారుగా కనిపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా రోహిత్ శర్మ, అశ్విన్, రహానె తదతరులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. క్లిష్టమైన సిరీస్‌లో కుటుంబ సభ్యులు తమ వెంట ఉండడంతో క్రికెటర్లలో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. వారు వెంట ఉండడంతో క్రికెటర్లు కూడా హుషారుగా కనిపిస్తున్నారు. రహానె, అశ్విన్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కూడా క్వారంటైన్‌లో హుషారుగా కనిపిస్తున్నారు. వీరు కూడా తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

 

Indian Cricketers enjoy with families in England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News