- Advertisement -
నిజామాబాద్: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం పోలీసుల తనిఖీల్లో రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు రెండు ఆటోలు, బైక్, 5 ముబైల్ ఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.8 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
44 kg Ganja Seized in Nizamabad
- Advertisement -