Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 156 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Covid 19 Restrictions extended till 31 in India

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 156 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 188 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1954 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,74,708కి చేరుకుంది. మొత్తం 20,58,289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,465 మంది మృతి చెందారు.

AP Report 156 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News