Monday, April 29, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోడానికి కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండడంతో మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉడాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. మొదట 2023 మార్చి 15 వరకు ఉన్న గడువును డిసెంబర్ 14 వరక పొడిగించింది. తరువాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకోడానికి అవకాశం కల్పించింది.

తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉడాయ్ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫోటో పాస్‌బుక్, పాస్‌పోర్టు వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.

టీసీ, మార్క్‌షీట్, పాన్/ ఇప్యాన్ , డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపిందిఇ. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఉచిత సేవలు ‘ మై ఆధార్ పోర్టల్ ’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News