Sunday, April 28, 2024

లిక్కర్ స్కామ్: నిందితుడు అభిషేక్ బోయినపల్లికి బెయిల్

- Advertisement -
- Advertisement -

లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ లభించింది. తన భార్యకు అనారోగ్యంగా ఉన్న కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించి, ఐదువారాలపాటు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టును సరెండర్ చేసి, హైదరాబాద్ లో చికిత్స చేయించేందుకు  అనుమతి ఇచ్చింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేశాక ఉత్తర్వులు అమలులోకి వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.   ఈడి అధికారులకు ఫోన్ నంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News