Monday, April 29, 2024

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కి తిరిగొచ్చిన ‘ఆచార్య’

- Advertisement -
- Advertisement -

Acharya movie khammam shoot completed

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాతలు. గత కొన్ని రోజులుగా దర్శకుడు కొరటాల శివ ఖమ్మంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఖమ్మం షెడ్యూల్ పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఇక చిరు, చరణ్‌లపై ఎమోషనల్ ఘట్టాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించారని తెలిసింది. దేవదాయ శాఖ కుంభకోణం, రాజకీయాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Acharya movie khammam shoot completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News