మొక్కలునాటిన హీరోయిన్ ఆదాశర్మ
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ నిరంతర ప్రవాహినిలా సాగుతుంది. శ్రీరంగం నుంచి శ్రీనగర్ దాకా పచ్చదనాన్ని పరుస్తోంది. వేళ్లు వేర్లను నేలకు పరిచయంచేస్తూ అనేక హృదయాలు గ్రీన్ఇండియా ఛాలెంజ్ను వంతుల వారిగా పంచుకుంటున్నాయి. దేశమంతా గ్రీన్ఇండియా ఛాలెంజ్ ట్రెండ్లా ముందుకు దూసుకుపోతుంది. గురువారం బ్యూటీ బ్రాండ్ ఆదాశర్మ మొక్కలు నాటారు. క్వశ్చన్ మార్క్ సినిమా నిర్మాత గౌరికృష్ణ ఇచ్చిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి ముంబాయిలోని తన నివాసంలో ఆదాశర్మ మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ను ఆదాశర్మ అభినందించారు.
అదాశర్మ మొక్కలు నాటి ట్విట్టర్లో ఎంపి సంతోష్ కుమార్కు పోస్టుచేయగా ఎంపిసంతోష్ కుమార్ ఆదాశర్మను అభినందించారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ నాల్కల్ వాటర్ ట్యాంక్ దగ్గర మొక్కలు నాటారు. అనంతరం నిజాంపేట, కరీంనగర్, రామగుండం మున్సిపల్ కమిషనర్లకు ఆయన గ్రీన్ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటి ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జక్రాన్పల్లి మండలం ఎస్ఐ సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.