Monday, April 29, 2024

అక్టోబర్ 17 నుంచి ఏడాదిపాటు ఎఐఎడిఎంకె వ్యవస్థాపక స్వర్ణోత్సవాలు

- Advertisement -
- Advertisement -

AIADMK Founding Golden Jubilee from October 17th

చెన్నై: ఈ నెల 17 నుంచి ఏడాది పాటు తమ పార్టీ వ్యవస్థాపక స్వర్ణోత్సవాలు(2021-22) జరుగుతాయని తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం ఎఐఎడిఎంకె బుధవారం ప్రకటించింది. తమిళనాడులో న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు, ‘దుష్ట శక్తి’ పాలనను కూలదోసేందుకు విప్లవ నాయకుడు ఎంజి రామచంద్రన్ ఎఐఎడిఎంకెను 1972లో స్థాపించారని పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్‌సెల్వం, సహ-సమన్వయకర్త కె పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. చారిత్రాత్మక స్వర్ణోత్సవాలను అట్టహాసంగా, వైభవంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వారు పిలుపునిచ్చారు. తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలలో దివంగత ముఖ్యమంత్రులు ఎంజిఆర్, జె జయలలితల విగ్రహాలకు పూలదండలు వేసి, పార్టీ జెండాలను ఎగురవేయాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News