Sunday, April 28, 2024

రహానెకు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

Ajinkya Rahane name on MCG honours board

మెల్‌బోర్న్: భారత స్టార్ ఆటగాడు అజింక్య రహానెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానె అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. దీంతో రహానెకు ప్రతిష్టాత్మకమైన జానీ ముల్లగ్ పతకం లభించింది. అంతేగాక బాక్సిండ్ డే టెస్టులో టీమిండియాకు చారిత్రక విజయం అందించిన రహానెకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నిర్వాహకులు మరో అరుదైన గౌరవంతో సత్కరించారు. ఎంసిజి ప్రతిష్టాత్మకంగా గౌరవించే బోర్డులో రహానె పేరును నమోదు చేశారు. ఇక రహానె ఇలాంటి గౌరవం సాధించడం ఇది రెండోసారి కావడం విశేషం.

Ajinkya Rahane name on MCG honours board

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News