Sunday, April 28, 2024

సర్వమత సమ్మేళనంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

- Advertisement -
- Advertisement -

All religions plant trees in Green India challenge

హైదరాబాద్: “మనిషి పుట్టక ముందు అన్నీ నేర్చుకొని పుట్టరు ఎవ్వరం ఎట్ల పుట్టాలో, ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకోలేం, కానీ ఎట్లా బ్రతకాల్నో మన చేతుల్లోనే ఉందంటారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు చెప్పారు. అందరు కలిసి మెలిసి జీవించే అద్భుతమైన గంగా జమునా తెహజీబ్ కి ప్రతీక మన తెలంగాణ, దీన్ని నిలబెట్టుకోవాలని కెసిఆర్ నిత్యం చెప్తుంటారన్నారు. పండగల నుంచి మొదలు కుంటే ప్రకృతిని సంరక్షించుకునే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దాక తెలంగాణ బిడ్డలు ఆ మాటను నిత్యం నిజం చేస్తూనే ఉన్నారు.

ఇవ్వలా బోరబండలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం గంగా జమునా తెహజీబ్ కి ప్రతీరూపంగా నిలిచింది. బోరబండలోని అన్నీ మతాల ప్రజలు రామాలయంలో జమ్మి మొక్కను, మస్జీద్ లో రేగు మొక్కను, చర్చిలో క్రిస్మస్ ట్రీని నాటారు. అనంతరం, రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడారు. “సర్వమతాల సమ్మేళనం మన హైదరాబాద్” పీర్ల పండగకు హిందువులు దస్తీ కడతరు, హిందువుల పండగలకు ముస్లీంలు దట్టీలు కడతరని మెచ్చుకున్నారు. క్రీస్మస్ కి అందరు కలిసి మెలిసి స్వీట్లు పంచుకుంటరుని, ఈ అపురూపమైన గంగా జమునా తెహజీబ్ తెలంగాణకే వన్నె తెచ్చిందని ప్రశంసించారు. ఈ సోదర సంస్కృతికి మనందరం గర్వించాలని ఆకాంక్షించారు. మనం చేసే ప్రతీ పనిలో మన సంస్కృతిని భాగం చేయాలనే తలంపుతో ఇవ్వాల అన్ని మాతాల ఆలయాల్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను భాగం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు అని కొనియాడారు.

అనంతరం, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం అద్భుతమైనదని ప్రశంసించారు. మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారమని, అంతేకాదు, నిస్వార్ధంగా కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను జీవరాశికి అందిస్తున్నాయన్నారు. అట్లాంటి చెట్లను మనిషి తన స్వార్థం కోసం కొట్టేస్తున్నడని, దీన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు కరుణాకర్ రెడ్డి, రాఘవ, కిషోర్ తో పాటు స్థానిక నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News