Monday, April 29, 2024

ఢిల్లీలో టిఆర్‌ఎస్ ఆఫీస్

- Advertisement -
- Advertisement -

Allocation of Land for TRS party office in Delhi

 

కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు వసంత్ విహార్‌లో 1100 చదరపు

మీటర్ల జాగా త్వరలో శంకుస్థాపన : ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం స్థలం కేటాయించింది. గత కొద్ది నెలలుగా టిఆర్‌ఎస్ పార్లమెంట్ నాయకులు పార్టీకార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాలను అన్వేషించారు. టిఆర్‌ఎస్ రాజ్యసభ పక్షనాయకుడు కెకె, పార్లమెంట్ నాయకుడు నామా ఢిలీల్లో స్థలాలను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని స్థలాలను ఢిల్లీలోని అధికారులకు సూచించారు. ఈమేరకు న్యఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు కేంద్రప్రభుత్వ హౌజింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవెలఫ్‌మెంట్ అధికారి దీన్‌దయాళ్ ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖరాశారు. ఢిల్లీలో స్థలం కేటాయింపు సమస్యపరిష్కారం అవడంతో త్వరలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News