Sunday, April 28, 2024

‘పవన్‌ సిఎం కావాలని వాళ్లంతా కోరుకున్నారు, కానీ..’

- Advertisement -
- Advertisement -

ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందేనన్నారు. బిజెపి వస్తే.. రాష్ట్రంలో ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు జరుగుతాయని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఎపి రెండు పాచిపోయిన లడ్డూ ఇచ్చారని కేంద్రాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అదే బిజెపితో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు.

అందరూ కలిసినా మాకేమీ కాదని.. ప్రజలు తమ వైపే ఉన్నారని అంబటి చెప్పారు. పవన్‌ ముఖ్యమంత్రి కావాలని కాపులంతా ఎదురుచూశారని..కాని, పవన్‌ మాత్రం చంద్రబాబును సిఎం చేయాలని చూస్తున్నారని మంత్రి అంబటి ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News