Monday, April 29, 2024

వెనక్కి తగ్గం

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh Telangana water dispute issue

సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాటంలో వెనకడుగు ప్రసక్తే లేదు

9న జరగనున్న కృష్ణ,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించాలి, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం, ప్రగతిభవన్ అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశంలో బచావత్ బ్రిజేష్ కుమార్ తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, కేంద్ర గెజిట్‌పైనా సమీక్ష ఆదివారం నాడు మళ్లీ భేటీకి నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: సాగునీటి హక్కుల కోసం, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరోసారి స్పష్టం చేశారు. అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న కృష్ణా, గోదావరి నదీ యజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతి భవన్‌లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది.

తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షున్నంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను క్షున్నంగా సమీక్షించారు. గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి విస్తృతంగా సమావేశం చర్చించింది. తిరిగి ఇదే అంశం పై ఆదివారం చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు , ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్, ఇఎన్‌సి మురళీధర్, హరిరామ్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట విభాగం సిఇ మోహన్ కుమార్, ఎస్‌ఇ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News