మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 16 కరోనా కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు వైద్యవర్గాలు బుటిటెన్లో పేర్కొన్నారు. వైరస్ బారిన పడి పూర్తిగా కొలుకొని 56 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జ్ల సంఖ్య96కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 393 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే చనిపోయిన వారిలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల ఈ వ్యక్తికి మర్కజ్ వెళ్లోచ్చిన వారి నుంచి వైరస్ సోకింది. దీంతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. దీంతో పాటు శుక్రవారం ఒ కార్పొరేట్ ఆసుపత్రి నుంచి గాంధీకి వచ్చిన మహిళ కూడా కరోనాతో చనిపోయిందని అధికారులు నిర్ధారించారు.