Sunday, April 28, 2024

రాష్ట్ర సరిహద్దులో రూ. 75 లక్షలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

AP, TS border Rs. 75 lakh seized

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పంచలింగాల చెక్‌పోస్ట్‌లో ఆదివారం నాడు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఓ కారులో తరలిస్తున్న రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఒకవైపు గంజాయి, మరోవైపు అక్రమ మద్యం తరలింపుపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ నగదు పట్టుబడింది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్నూలు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల వద్ద ఒక కారులోని బ్యాగ్‌లో 75 లక్షల రూపాయలు నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి నగదు, కారును సీజ్ చేశారు. ఈ నగదును హైదరాబాద్ నుండి బీదర్ కి తరలిస్తున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. కేసు నమోదు చేసుకుని కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News