Sunday, April 28, 2024

చైనా నిషేధంతో యాపిల్ షేర్లు ఢమాల్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్ వాడకంపై నిషేధం విధించిన తర్వాత యాపిల్ షేర్లు వరుసగా రెండో రోజు పడిపోయాయి. గత రెండు రోజుల్లో కంపెనీ షేర్లు దాదాపు 6% పడిపోయాయి. గురువారం భారీగా 2.92 శాతం తగ్గి 177.56 డాలర్ల వద్ద ముగిసింది. యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్ చైనా, గతేడాది మొత్తం ఆదాయం 394 బిలియన్ డాలర్లలో ఈ దేశం వాటా 18 శాతంగా ఉంది. యాపిల్ చాలా ఉత్పత్తులు చైనాలోనే తయారు చేస్తారు. అమెరికా నిఘా ఉందనే కారణంగా ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం విధించగా, దీని వల్ల చైనాలో ఐఫోన్ విక్రయాలు 5 శాతం పడిపోవచ్చని భావిస్తున్నారు.

Also Read: ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News