Monday, April 29, 2024

ఎపి దౌర్జన్యం నిజమే

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్ ఘటనపై కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక
సిఆర్‌పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్
కృష్ణా వివాదంపై 6న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర జలశక్తి శాఖ

సాగర్ నీటి విడుదలపై రేపు కృష్ణా బోర్డు సమావేశం
రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తాం: కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన నాగార్జున సాగర్ జలాశయాన్ని శనివారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. మొదట సాగర్ ఎడమ కాలువను పరిశీలించా రు. అనంతరం కుడి కాలువను సందర్శించారు. అలాగే డ్యామ్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్‌రావు సైతం పరిశీలించారు. ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాల మేరకు నా గార్జున సాగర్ కుడి కాలువ ఏడవ నెం బర్ గేటును అధికారులు మూసివేశా రు. ప్రస్తుతం ఐదో నంబర్ గేట్ ద్వారా నీటి విడుదలవుతోంది. ఈ గేట్‌ను కూ డా రాత్రి వరకు మూసివేయనున్నట్లు సమాచారం. ఎపి విభజనలో భాగంగా కేఆర్‌ఎంబీ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. అయితే, గత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా డ్యామ్‌పై పోలీసు బలగాలను మోహరించి ,అనుమతి లేకుండా నీటిని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం కూడా బలగాలను సంఘటనా స్థలం లో మోహరించింది. కేంద్రం జోక్యంతో రెండు రాష్ట్రాలు బలగాలను ఉపసంహరించాయి. ప్రస్తుతం డ్యామ్‌ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, పరిస్థితిపై కృష్ణానదీయాజమాన్య బోర్డు కేంద్రానికి నివేదిక అందజేసింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి వ్యవహరించిందని నివేదిక లో పేర్కొంది. ఇండెంట్ లేకుండా, లేఖ రా యకుండా ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా నీటిని విడుదల చేసిందని నివేదికలో తెలిపింది. మొదట ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్‌లో ఐదు టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉందని నివేదికలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.

రేపు కృష్ణాబోర్డు సమావేశం, 6న కీలక భేటీ
తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జల్‌శక్తి శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందను తాను సమావేశానికి హాజరుకాలేనని, సమావేశం తేదీ మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శిని కోరగా, ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహించనున్నట్లు కేంద్ర కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి వెల్లడించారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అప్పటి వరకు రెండు రాష్ట్రాలు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖ ర్జీ సూచించారు. అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్‌పై ఈ నెల 4న కేఆర్‌ఎంబీకృష్ణానదీయాజమాన్య బోర్డు స మావేశం నిర్వహించి నీటి విడుదలపై ని ర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు, వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఈ నెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తామని , అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని కేంద్ర కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, సెంట్రల్ ఇండష్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్స్‌తోపాటుగా ఆంధప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి , జలవనరులు శాఖ కార్యదర్శి శశిభూషన్ కుమార్ , ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News