Monday, April 29, 2024

జల్సాలకు అలవాటుపడి చోరీలు.. 16 లక్షల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మియాపూర్ లో వరస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి యువకుడు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అటు హుమాయూన్ నగర్ లో పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 3న జరిగిన చోరీ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 14 లక్షలు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News