Monday, April 29, 2024

పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి, అనంతారం గ్రామాల్లోని వివిధ పార్టీల నుంచి మంత్రి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రభుత్వ సంక్షేమ పధకలకు ఆకర్షితులై మూ డు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి 6వ వార్డు సభ్యురాలు అంజమ్మ, అనంతరం గ్రామ ఉప సర్పంచ్ చింతకాయల రాజు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News