- Advertisement -
హైదరాబాద్ : ఢిల్లీ తరహలో నగరంలో మతఘర్షణలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఆడియో సందేశం సర్కులేట్ చేసిన వ్యక్తిని నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన రెహమత్ షరీఫ్(35) నగరంలో మతకలహాలు జరుగుతున్నాయని చెప్పి ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేశాడు. ఈ ఆడియో నగరంలోని వివిధ సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దృష్టికి వచ్చింది. వెంటనే దీనిని సృష్టించిన వారిని పట్టుకోవాలని ఆదేశించడంతో పోలీసులు షరీఫ్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
Audio on social media with riots in Hyderabad
- Advertisement -