Monday, April 29, 2024

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

అశ్విన్, అక్షర్ పటేల్‌కు స్థానం
టి20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన
కొత్త బాధ్యతల్లో ధోనీ

ముంబయి: వచ్చే అక్టోబర్‌లో జరగనున్న టి20 వరల్‌డ కప్ మ్యాచ్‌లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీసారథ్యంలో 15 మంది సభ్యుల బృందాన్నిఎంపిక చేసింది. అయితే రోహిత్ శర్మతో ఒవరు ఓపెనింగ్ చేస్తారో మాత్రం స్పష్టం కాలేదు. కాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. జట్టులో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌కు చోటు కల్పించారు. యుఎఇ వేదికగా అక్టోబర్ 17నుంచిటి 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నెల 19నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని మిగతా మ్యాచ్‌లు కూడా యుఎఇ వేదికగానే జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టి20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది.

జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.

BCCI Announces T20 World Cup Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News