Monday, April 29, 2024

బీహార్ సిఎం నితీశ్ సభలో పేలుడు కలకలం

- Advertisement -
- Advertisement -

Nitish Kumar

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నలందలో నిర్వహిస్తున్న జనసభలో బాంబు దాడి జరిగింది. ముఖ్యమంత్రికి అతి సమీపంలో బాంబు పడింది. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్‌పై రెండు వారాల క్రితం భక్తియార్‌పూర్‌లో ఓ యువకుడు దాడి చేశాడు. అతడి మానసిక పరిస్థితి బాగలేదని ఆ తర్వాత వదిలిపెట్టారు. నితీశ్‌పై వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. బీహార్‌లో ప్రస్తుతం ఎన్ డిఏ  ప్రభుత్వం అధికారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News