Friday, May 17, 2024

బ్రహ్మం గారి 413 వ జయంతి ఉత్సవాలు…

- Advertisement -
- Advertisement -

విశ్వకర్మ ప్రతినిధులతో బీసి కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
సంఘ సంస్కర్త పోతులూరి

Brahmam garu birth anniversary
మనతెలంగాణ, హైదరాబాద్: కాలజ్ఞానం బోధించి, సకల జనుల హితం కోరిన సంఘ సంస్కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం అని బీసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. మంగళవారం బ్రహ్మం గారి 413 వ జయంతి ఉత్సవాలను విశ్వకర్మ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్దనున్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

బ్రహ్మంగారి విగ్రహం వద్ద వారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డా.వకుళాభరణం మాట్లాడుతూ పరమత సహనాన్ని, సర్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి అనుసరింపజేసిన మహోన్నత ఆశయవాది పోతులూరి వీరబ్రహ్మం అని ఆయన కొనియాడారు. జీవితంలో ప్రతీఒక్కరూ బ్రహ్మం గారి మఠమును సందర్శించుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ఏ వింత సంఘటన జరిగినా, కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని ప్రజలు చర్చించుకోవడం గమనించదగింది అని ఆయన ప్రస్తావించారు. ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్రాచారి, జితేంద్రలు కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News