Monday, April 29, 2024

సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైం: సైబర్ నేరాలు జరిగిన వెంటనే కేసులను నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు కమీషనరేట్‌లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తస్కరించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందన్నారు.

శుక్రవారం కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో కమీషనరేట్ పోలీసుల అర్థ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందిన సత్వరం స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సేవలందించాలని తెలిపారు.

పని చేయని సీసీ కెమెరాలకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని చెప్పారు. ప్రధానంగా ప్రధాన కూడళ్ళల్లోని కెమెరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు పరిష్కరించబడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్ (పరిపాలన), అడిషనల్ డీసీపీ (సీఏఆర్), భీంరావు, టైనీ ఐపీఎస్ అధికారి గీత్ మహేష్ బాబాసాహెబ్, ఎసీపీలు నరేందర్, కరుణాకర్‌రావు, విజయ్‌కుమార్, మదన్ లాల్, శ్రీనివాస్, సి ప్రతాప్, కాశయ్య, జీవన్‌రెడ్డి, ఎస్‌బీఐ జి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News