Saturday, April 27, 2024

నేతన్నలకు నగదు

- Advertisement -
- Advertisement -
Cash assistance for Handloom workers

 

గడువుకి ముందుగానే రూ. 93 కోట్ల చేయూత నిధులు
26,500 మందికి ఆర్థిక వెసులుబాటు

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ప్రత్యేకమైన చర్య తీసుకున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ శాఖ మ ంత్రి కె. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ మరియు లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతన్నల వద్ద మరింత నగదును పెంచే ఉద్దేశంతో గతంలో తెలంగాణ ప్ర భుత్వం ప్రారంభించిన నేతన్నకు చేయూత పథకంలో భాగం గా గడువు పూర్తి కాకముందే నేతన్నలకు సుమారు రూ.93 కోట్ల నగదు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. శనివారం బషీర్‌బాగ్‌లోని టిఎస్‌ఐఐసి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్షించారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌తో పాటు హైదరాబాద్ ఫా ర్మా సిటీ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎరోస్పే స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల శాఖలోని పలు విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. తదనంతరం ప్రత్యేకంగా బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియ పురోగతిపై మంత్రి కెటిఆర్ ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న గడువు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేతన్నకు చేయూత పొదుపు పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నట్లు తెలిపారు. ఈ పథకంలో చేరిన నాటి నుంచి మూడేళ్ళ పాటు లాకిన్ పీరియడ్ ఉంటుందని అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నేతన్నలు ఈ పథకం నుంచి నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సౌకర్యం కల్పించడంతో నేతన్నలకు సుమారు రూ. 93 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు ఎనిమిది శాతం తమవాటాగా జమ చేస్తే దానికి రెట్టింపుగా రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా జమ చేసిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు పవర్‌లూమ్ కార్మికుల 8 శాతం నేతన్నల వాటాకు సమానంగా మరో ఎనిమిది శాతం ప్రభుత్వం జమ చేసిందన్నారు.

మొత్తం మూడు సంవత్సరాల లాకిన్ పీరియడ్‌తో ఇప్పటి వరకు కార్మికులు సుమారు రూ.31 కోట్ల రూపాయలు జమ చేయగా, ప్రభుత్వం తన వాటాగా రూ. 62 కోట్లను అదనంగా జమ చేసిందన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తక్షణమే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం నేతన్నలకు లభించనుందన్నారు. దీనిద్వారా సుమారు 26,500 మంది నేతన్నలకు ఉపశమనం లభిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ పథకంలో భాగస్వాములైన నేతన్నలకు ఒక్కొక్కరికి రూ. 50వేల నుంచి సుమారు 1.25 లక్షల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతో పాటు సొసైటీల పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం యొక్క డబ్బులను చెల్లించడం ద్వారా మరో రూ. 1.18 కోట్లను నేతన్నలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ డబ్బులు సుమారు 2337 మంది కార్మికులకు అందుతాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్‌లో ్ల భారీగా నిధులు కేటాయించడంతో పాటువారి ఉత్పత్తులకు డిమాండ్ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆపత్కాలంలోనూ నేతన్నలను ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లుతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత మరియు జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యార్, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News