Monday, April 29, 2024

కియా ముందు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పెనుగొండ నియోజకవర్గంలోని కియా కార్ల ఫ్యాక్టరీని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సందర్శించారు. తన పర్యటనలో టీడీపీ హయాంలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ దిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని అనంతపురం జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ దార్శనికత, జిల్లాపై ప్రేమతో కియా ప్రపంచం అభివృద్ధి చెందిందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విధ్వంసానికి కారణమైందని ఆరోపించారు.

ఒకప్పుడు బంజరు భూమిలో కియా లాంటి పరిశ్రమను స్థాపిస్తారని ఎవరైనా ఊహించారా అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గొల్లపల్లి ప్రాజెక్టును కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేశామని, ఆ తర్వాత కియా పరిశ్రమను విజయవంతంగా స్థాపించామని సగర్వంగా చెప్పారు. అంతేకాకుండా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఓ మహిళతో జరిగిన వీడియో కాల్ ఘటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు పరోక్షంగా ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News