Monday, April 29, 2024

అరుణాచల్‌కు దగ్గర్లో చైనా ఎత్తులు

- Advertisement -
- Advertisement -

China bullet train near Arunachal Pradesh

 

బీజింగ్ : భారత్‌కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్‌లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్‌ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి స్థాయి ఎలక్ట్రికల్ బుల్లెట్ రైలు దూసుకుపోతుంది. అత్యంత వ్యూహాత్మకంగానే చైనా అరుణాచల్‌కు అత్యంత సమీపంలో నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా మార్గాన్ని ఎంచుకుంది. చైనా ప్రాంతీయ రాజధాని లాహ్సాకు, టిబెట్‌లోని న్యింగ్చికి కలుపుతూ ఈ రైలు మార్గం ఏర్పడింది. ఇది సిచ్యూవాన్ టిబెట్ రైల్వేకు చెందిన లాహ్సా న్యింగ్చి సెక్షన్‌లో ఏకంగా 435 .5 కిలోమీటర్ల పొడవునా ఈ బుల్లెట్ ట్రైన్ విస్తరించుకుని పోతుంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని చైనా తరచూ వాదిస్తూ భారత ప్రాదేశిక సర్వసత్తాకతకు తరచూ సవాలు విసురుతూ వస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ వాదనకు విలువ లేకుండా పోయింది.

దీనితో ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకే చైనా తన బుల్లెట్ ట్రైన్‌ను ఇక్కడ ప్రవేశపెట్టిందని భావిస్తున్నారు. చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ వ్యక్తిగత ఆదేశాలతో ఆసక్తి కనబర్చడం వల్లనే ఈ బుల్లెట్ ట్రైన్ అత్యంత తక్కువ కాలంలోనే రూపుదిద్దుకుంది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ట్రైన్‌ను చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శతజయంతి జులై 1న జరిగే నేపథ్యంలోనే ఈ ట్రైన్‌ను ఆరంభించారు. ఈ ట్రైన్‌కు ఫ్యూక్సింగ్ అని పేరుపెట్టినట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. సింగిల్ లైన్‌పై వేళ్లే ఈ రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది. దీనిని ప్రయాణికులకు , సరుకు రవాణాకు వినియోగిస్తారు. ఈ రైలు మార్గం వెంబడి అత్యధిక సంఖ్యలో టన్నెల్స్, బ్రిడ్జిలు ఉంటాయి. టిబెట్ సింధుశాఖ ప్రాంతంలో వెళ్లే ఈ రైలు బ్రహ్మపుత్ర నదికి సమీపంలోనుంచే వెళ్లుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News