Sunday, April 28, 2024

వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడుః జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక మీదనుంచి సిఎం జగన్ బటన్ నొక్కి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ”ఏ రోజు మేం అధికారం కోసం వెంపర్లాడలేదు.. పొత్తుల కోసం పాకులాడలేదు. దత్తపుత్రుడిలా నోటికొచ్చినట్లు తిట్టలేం. వాళ్లకు అధికారమంటే దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు దత్తపుత్రుడు మద్దతు తెలిపాడు.

ఎన్నికల తర్వాత చంద్రబాబు మోసం చేస్తే దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు. దత్తపుత్రుడు.. ఓ ప్యాకేజీ స్టార్ ఇప్పుడు లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. దత్తపుత్రుడు మామూలుగా మాట్లాడడు.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ మాట్లాడుతాడు. చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు. దత్తపుత్రుడి నోటికి అదుపులేదు, నిలకడా లేదు. దత్తపుత్రుడిలా నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం. పెళ్లిబంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్” అని ఎద్దేవా చేశారు.

Also Read: ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కెటిఆర్ ఆరా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News