Monday, April 29, 2024

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR attend in Prime Minister video conference

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుంటున్న కేంద్రం

మన తెలంగాణ/ హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ప్రధాన నరేంద్రమోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనగా మరికొందరు నేతలు, వివిధ రంగాల ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

కాగా ఈ కమిటీలో ప్రాతినిథ్యం వహిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, అధికారులు, మీడియాసంస్థల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం హాజరై తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎపి ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News