Sunday, April 28, 2024

ఐదు ఎకరాల లోపు రైతులే 91 శాతం మంది: పల్లా

- Advertisement -
- Advertisement -

CM KCR help to Farmers in Telangana

 

హైదరాబాద్: ప్రతిపక్షాలు అసభ్య పదజాలంతో ప్రభుత్వంపై విమర్శలు చేశాయని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చ కొనసాగుతున్న సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసన మండలిలో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన పనులను తాము ప్రజలకు వివరంగా వివరించామని, సిఎం కెసిఆర్ పాలనపై పట్టభద్రులంతా విశ్వాసం ప్రకటించారని గుర్తు చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో మమ్మల్ని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారని కొనియాడారు. దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని ప్రశంసించారు. రైతు బంధు లబ్ధిదారుల్లో 91 శాతం మంది ఐదు ఎకరాల లోపు రైతులే ఉన్నారని తెలియజేశారు. రెండు పంటలకు రైతుబంధు కింద రూ.14800 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News