Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లిలోని సిఎం కెసిఆర్ వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం యాగం ప్రారంభమైంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామ లా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకర ణం చేశారు. కెసిఆర్ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వస్త్రలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెం దిన 170 మంది రుత్విక్కులు ఇందులో పాల్గొంటున్నా రు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, రాజశ్యామల యాగం ప్రాముఖ్యతను వివరించా రు. రుద్ర, చండీ, వనదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని, రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపా రు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే రాజశ్యామల యాగం కఠినమైన భీజాక్షరాలతో కూడినదని వివరించారు. మహా శక్తివంతమైన రాజశ్యామల యాగ ఫలితం ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికే కాదని, యావత్ రాష్ట్రానికీ ఉంటుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందన్నా, హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిందన్నా గతంలో కెసిఆర్ చేసిన రా జశ్యామల యాగం ఫలితమే అని పేర్కొన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని కెసిఆర్ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రులు ఎందరో తనకు తెలిసినా హైందవ తత్తం పరిపూర్ణంగా తెలిసిన నేత కెసిఆర్ మాత్రమేనని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకున్న కెసిఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువై ఉన్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠమేనని స్పష్టం చేశారు. హిమాలయాల్లో మహాత్ముల చెంత అమ్మవారి ఉపాసన పొందానని తెలిపారు. కెసిఆర్ కుటుంబంతో పాటు ఎంపి సంతోష్, ఎంపి నా మానాగేశ్వర్ రావు, ఎంఎల్‌సి మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు యాగంలో పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా యాగానికి అంకురార్ప
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని, సస్యశ్యామలం కావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యా గంగా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా ప్రారంభమైన యాగం మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఉద యం గోపూజ అనంతరం కెసిఆర్ దంపతులు యాగశా ల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగిం ది. కెసిఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. గురు ఆజ్ఞ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. కెసిఆర్ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సం కల్పం చెప్పించారు.విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. లోకకళ్యాణార్థం సిఎం కెసిఆర్ దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగము నిర్వహించారు. దీనిలో భాగంగా గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా,స్వస్తి పుణ్యాహవాచనము,ఆచార్యాది ఋత్విగ్వరణము యాగ శాలా సంస్కారం, గోపూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమ ము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము తదితర కార్యక్రమాలను సిఎం కెసిఆర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News