Monday, April 29, 2024

ఎవుసం మారాలి

- Advertisement -
- Advertisement -

CM KCR review on Agriculture

 

అందుకోసం నాలుగంచెల వ్యూహం

రైతులకు అవగాహన కల్పించే బాధ్యత

వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి

ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు

మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం మత్తడి

దుంకుతున్నాయి దేశంలో నం.1 స్థాయికి తెలంగాణ వ్యవసాయం

ఇకనుంచి పంటలకు బుల్లెట్ల దూసుకొస్తాయి ఏడాదిలో తెలంగాణ మొత్తం

పచ్చబడబోతోంది సిమెంట్ ఫ్లోర్ల మీద సాగు చేసే పరిస్థితి వస్తుంది

జిల్లాలు, రాష్ట్రస్థాయి అధికారులతో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను, యాంత్రీకరణను విరివి గా ఉపయోగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ దిశగా సరియైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. దీని కోసం నాలుగ ంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని సూ చించారు. ఇందుకు రైతాంగాన్ని కూడా చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రైతు సంక్షేమ బాధ్యతను వ్యవసాయ శాఖ భుజాన వేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదలతో సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సిఎం పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఎ వరికి తోచినట్టు వారుగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పై అధికారుల ఆదేశాల ను అనుసరించి నడుచుకోవాలని సూచించారు.

మార్కెట్లో సరైన ధరలు లభించే అవకాశం ఉన్న పంటల రకాలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పి ంచే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే అని సి ఎం అన్నారు. తమ ఇష్టానుసారం కాకుండా అన్ని జిల్లాల అధికారులు తమ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆలోచనా ధృక్పథాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలన్నారు. తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అ ధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో పనిచేయాలన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు రంజిత్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బాల్క సుమన్, కంచెర్ల భూపాల్ రెడ్డి, శంకర్ నాయక్, చిరుమర్తి లింగయ్య, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, అగ్రికల్చర్ యూనివర్శిటీ విసి ప్రవీణ్ రావు, హార్టికల్చర్ ఎండి వెంకట్ రామిరెడ్డి, మార్కెటింగ్ డైరక్టర్ లక్ష్మీబాయి, అన్ని జిల్లాల డిఎవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయం వేగవంతంగా అ భివృద్ధి చెందుతున్నదన్నారు. వ్యవసాయ శాఖకు సం బంధించిన అన్ని రకాల వ్యవస్థలు అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నదన్నారు. ప్రభుత్వ సూచనలను గౌరవించి నియంత్రిత వ్యవసాయానికి రైతులు అలవాటు పడుతున్నారు.

వారికి ఏ పంటవేయాలి? ఎట్లా దిగుబడిని పెంచాలి? అనే విషయాలను ఎప్పటికప్పుడు వివరించాల్సిన బాద్యత వ్యవసాయ శాఖదేనని అన్నారు. అధిక దిగుబడులతో పంటలు పండిచడమే కాదు…రైతులు పండించిన పంటకు మంచి ధర వచ్చేందుకు ఎటువంటి మార్కెటింగ్ పద్ధతులను అ వలంభించాలో, అందుకు తగ్గట్టు వ్యవసాయ శాఖ ప్ర ణాళికలు సిద్దం చేసుకోవాలని సిఎం వివరించారు. రైతు లు సరియైన ధరలు వచ్చే పంటలను పండించేందు కు తగు ప్రణాళికలను తయారు చేయడం, కల్తీ విత్తనాలు మార్కెట్ లో లభ్యం కాకుండా జాగ్రత్త పడుతూ నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరియైన సమయంలో ఎరువులను అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడం వంటి మార్కెటింగ్ వ్యూహాలను పటిష్టంగా అమలు పరచాల్సివుంటదని అధికారులకు సిఎం వివరించారు. అట్లా వా టిని అన్వయించుకోని పోయినప్పుడు మాత్ర మే అది గొప్ప వ్యవసాయంగా మారుతుందని స్పష్టం చేశారు.

మక్క పంటకు విరామమే మంచిది

మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని క్వి ంటాలుకు రూ. 800 లేదా రూ. 900 మించి ధర పలకడం కష్టసాధ్యమైన నేపథ్యంలో అదే ధరకు అమ్ముకోదలచిన రైతులు మాత్రమే మక్కపంట వేసుకోవాలనే విషయాన్ని మరింతగా అర్థం చేయించాలని సిఎం కెసిఆర్ మరో మారు స్పష్టం చేశారు. మక్కజొన్నలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అనుకూలత లేదన్నారు. దానికితోడు కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించి లక్షలకొద్దీ టన్నులు దిగుమతి చేసుకోవడం, పక్కరాష్ట్రాల్లో మక్కలు తక్కువ ధరలకే లభించడం వంటి అంశాలు మొక్కజొన్న పంటసాగును నిరుత్సాహపరుస్తున్నవన్నారు. మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర రాదు అని తేల్చిచెప్పండని సి ఎం కెసిఆర్ సూచించారు. ఇందులో మొహమాటానికి పోయి సగం సగం సమాచారం ఇవ్వడం ద్వారా రైతు మొక్కజొన్న పంటవేసి నష్టపోయే ప్రమాదమున్నదన్నారు. వానాకాలం మాత్రమే కాదు యాసంగిలో కూ డా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. క్వింటాలుకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లోపే ధర పలికే పరిస్థితి వున్నదనే విషయాన్ని రైతుకు స్పష్టం చేయండి, అయినా మక్కలు పండిస్తం అంటే.. ఇక రైతుల ఇష్టమని సిఎం స్పష్టం చేశారు.

బుల్లెట్ లాగా దూసుకురానున్న పంటలు

ఇక నుంచి రాష్ట్రంలో పంటలు బుల్లెట్లలా దూసుకువస్తాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ సరియైన దిశగా ప్ర ణాళికలు సిద్దం చేసుకోకపోతే వ్యవసాయశాఖ కు ఇ బ్బందులు తప్పవన్నారు. నియంత్రిత సాగును పకడ్బందీగా అమలుపరిచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున నెలకొల్సి ఉంటుందన్నారు. అగ్రికల్చర్ ఎస్‌ఇజెడ్‌ల ఏర్పాటు చేసి, రైతన్న పండించిన పంటలకు ఎక్కడికక్కడ మార్కెటింగు అవకాశాలను మెరుగుపరిచి వారి పంటలకు అధిక ధరలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీదున్నదన్నారు.

ఆగం చేసిన చెరువులకు పునరుజ్జీవం

వలస పాలకులు ఆగం చేసిపోయిన గొలుసుకట్టు చెరువులను పునరుజ్జీవింపచేసుకున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. వాటిని సాగునీటి ప్రాజెక్టులతో నింపుకొన్నామన్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా చెరువులు నిత్యం మత్తడి దునుకుతున్నాయన్నారు. బోర్లు నీటితో పైకి ఉబుకుతున్నాయన్నారు. గత పాలనలో తెలంగాణ వ్యవసాయం గాలికి దీపం పెట్టి దేవుడా అనే పద్ధతిలో సాగిందని, ఇప్పుడు ప్రభుత్వ సాయంతో రైతులు స్వయం సమృద్ధితో పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. వారికి సకాలంలో పంటపెట్టుబడి అందుతున్నదన్నారు. నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తుతో పాటు, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు కూడా అందుతున్నవన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వసామర్థ్యం కలిగిన గోదాములను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదని వ్యాఖ్యానించారు. పెండింగు ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ, అడవుల పెంపకంతో వలసల జిల్లాగా పేరుపోయిన పాలమూరు జిల్లా ఇవ్వాల అత్యధిక వర్షాపాతం కలిగిన జిల్లాగా మారిపోయిందన్నారు. గతంలో పాలమూరు వలసపోయేదని, ఇప్పుడు ఇతర జిల్లాలనుంచే అక్కడికి వ్యవసాయ కూలీలు వలస వస్తున్నారన్నారు. పాలమూరు వ్యవసాయం అభివృద్ధి చెందడం తెలంగాణ వ్యవసాయం అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని సిఎం కెసిఆర్ అన్నారు.

దేశంలో నెంబర్ వన్ స్థాయికి

రేపు రాబోయే యాసంగి సీజన్‌కు దాదాపు 70 లక్షల ఎకరాలు వ్యవసాయానికి సిద్ధమైనాయని ఉన్నతాధికారులు రిపోర్టులు సిద్దం చేసినారంటే.. దీన్నిబట్టి, తెలంగాణ వ్యవసాయం, దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని స్సష్టమైతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల వున్న అభిప్రాయాలను స్వయం పాలనలో తిరగరాసిందన్నారు. గతంలో ‘వ్యవసాయం చేసుడు కన్నా పాన్ డబ్బా నడుపుకునుడు నయం’ అనే సామెత వుండేదని కానీ ఇప్పుడు వ్యవసాయమే లాభసాటి వ్యాపారంగా మారిందన్నారు. గతం లో వ్యవసాయం చేసే యువకునికి పిల్లనివ్వాలంటే ఇష్టపడేవారు కాదని, కానీ నేడు ఐటి రంగంలో ఉన్నతస్థాయిలో జీతాలు తీసుకునే యువతీ యువకులు సైతం వ్యవసాయం బాట పట్టినారని సిఎం వివరించారు.

తెల ంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాకుండా కేంద్రాన్నికూడా ప్రభావితం చేసిందన్నారు. ఒడిషా ప్రభుత్వం కాలియా పేరుతో తెలంగాణ అమలు పరుస్తున్న రైతుబంధు పథకాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనముందే విలేకరులకు చెప్పడం తెలంగాణకు గర్వకారణమని సిఎం వ్యాఖ్యానించారు. కేంద్రం అమలు పరుస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకమే ఆదర్శంగా నిలిచిందని సిఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబీమా పథకం ప్రపంచంలోనే మరెక్కడా అమలులోలేదన్నారు.

సిమెంట్ ఫ్లోర్ల మీద సాగు…

జనాభా పెరుగుతున్నది గాని భూమిపెరగడం లేదన్నా రు. భవిష్యత్తులో సిమెంటు ఫ్లోర్లు మీద వ్యవసాయం చేసే పరిస్తితి రాబోతున్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని సిఎం అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతును చాలా గౌరవిస్తారన్నారు. మన దగ్గరకూడా అదే పరిస్థితి రావాలన్నారు. వ్యవసాయ రంగం జిడిపికి తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుందనేది చాలా డొల్ల వాదన అని సిఎం అన్నారు. ఏడాదిలో తెలంగాణ మొత్తం పచ్చబడబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. చాలా అద్భుతమైన తెలంగాణను చూడబోతున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రజలు ఏమేమి తింటరనేది లెక్కలేకుండేన్నారు. ఒక ప్రయివేట్ సంస్థతో తానే స్వ యంగా సర్వే చేయించినప్పుడు తెలిసిందేమిటంటే.. ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా లభ్యమయ్యే చింతపండుకు లోటు ఏర్పడిందని సర్వేల తేలిందన్నారు. యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల చింతపండును రాష్ట్ర ప్రజలు వినియోగిస్తారని సర్వేలో తేలిందన్నారు. దీంతో అప్పటికప్పడు అటవీ శాఖను అప్రమత్తం చేసి భారీ స్థాయిలో చింతచెట్లను నాటించినట్లు సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రానికి దేవుడు మంచి నేలలు ఇచ్చిండు

దేవుడు తెలంగాణకు మంచి నేలలను ఇచ్చిండన్నారు. ప్రపంచానికే విత్తనాలను అమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గుజరాత్ వ్యాపారులు వాల్ల రాష్ట్రంలో పండే పత్తిని పక్కన పెట్టి, తెలంతాణ పత్తిని కొంటున్నారన్నారు. తెలంగాణ సోనా రకం వరి బియ్యాన్ని డయాబెటిక్ రోగులు తినవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పరిశీలించి అక్కడి పత్రికల్లో ప్రచురించారని సిఎం వివరించారు.

అగ్రికల్చర్ కార్డును రూపొందించే దిశగా

రైతు సంక్షేమాన్ని గుర్తెరిగి పనిచేస్తే రైతుల విశ్వాసాన్ని చూరగొనడం పెద్ధ కష్టమేమీ కాదని, తమ కోసమే అధికారులు పనిచేస్తున్నరనే సోయిని రైతుల్లో కలిగిస్తేనే వా రు విశ్వశిస్తారన్నారు. రాష్ట్రంలో పేద, బక్క, అన్నివర్గా ల రైతులను వ్యవసాయశాఖ ఆలోచనల పరిధిలోకి తీసుకురాగలిగే విధంగా అధికారులు కృషి చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. అధికారులిచ్చే సరియైన సలహా సూచనలను అనుసరించి రైతులు వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటారన్నారు. ఈ సూచనలు, స లహాలు వారికి లాభదాయకంగా మారితే రైతాంగం అ ధికారుల సలహాల కోసం ఎదురు చూస్తారన్నారు. ఆ రో జు కోసం అధికారులు కృషి చేయాలని అధికారులకు సి ఎం వివరించారు. ఏపంట వేయాలి ఏ పంట వేయకూడదు అనే విధానాలను రూపొందించి ‘డూస్ అండ్ డోం ట్ డూస్‘ గురించి వివరిస్తూ వచ్చే ఏడాదినుంచే ‘అగ్రికల్చర్ కార్డు’ ను రూపొందించే దిశగా వ్యవసాయశాఖ అ ధికారులు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకోవాలన్నారు.

పెరిగిన ప్రాధాన్యత

నేర్పరితనం, కలుపుగోలుతనం, వృత్తి నైపుణ్యాలతో వ్య వసాయ శాఖ అధికారులు ముందుకు సాగాలని సిఎం అన్నారు. అరమరికలు లేకుండా పెత్తనాల పంచాయితీలు లేకుండా మనసు పెద్ధది చేసుకుని ఆలోచిస్తూ కలిసిమెలిసి పనిచేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేన్నారు. టెన్ టు ఫైవ్ అన్నట్టుగా కాకుండా వ్యవసాయశాఖ నిరంతరం పనిచేయాల్సిన అవసరమున్నది. రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు శాఖాపరంగా ని రంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోవాలన్నారు. దసరాకల్లా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక లు సిద్ధం కానున్నాయన్నారు. రైతులతో నిరంతరం కలు స్తూ వారికి వ్యవసాయ సూచనలిస్తూ సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. అందుకోసం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని ఆదేశించారు. అభివృద్ధి పథాన సాగుతున్న తెలంగాణ పల్లెల రూపురేఖలు పట్టణీకరణ చెం దుతున్నాయని పేర్కొన్నారు.

ఖాళీలను వెంటనే భర్తీలు చేయాలి

వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సంబంధిత అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. తక్షణమే ఖాళీల భర్తీలను చేపట్టాలన్నారు. ప్రమోషన్లు పెండింగులో వుంటే వెంటనే ఇచ్చేయాలన్నారు. భార్యాభర్తలు ఇద్ధరూ ఉద్యోగులే అయితే ఒకే చోట పనిచేసేలా వారికి అవకాశాలు కల్పిస్తూ బదిలీ చేసే దిశగా ఉత్తర్వులు సిద్ధం చేయండి అని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవంగా సత్కరించి ఇంటికి సాగనంపాలన్నారు. వ్యవసాయశాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందని, రైతులకు సేవచేసేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సంసిద్ధ పరుచుకోవాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ ఉద్యోగుల మీద వున్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News