Monday, April 29, 2024

భయం వద్దు.. బీ అలర్ట్

- Advertisement -
- Advertisement -

CM KCR review on Corona

8-16 వరకు
విద్యాసంస్థలకు
సెలవులు

ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక
వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్
ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను
పెంచుకోవాలి
కోటి హోం ఐసోలోషన్ కిట్లు
సమకూర్చుకోండి అన్ని
సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల భర్తీ
పాత కలెక్టరేట్ల కార్యాలయాలను
వినియోగించుకోండి హెచ్‌ఎండిఎ
పరిధిలో వార్డుకొకటి, నగర
పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు
వైద్య ఆరోగ్య శాఖపై ప్రగతి భవన్
ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు
సిఎం కెసిఆర్ ఆదేశాలు
లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవని
ముఖ్యమంత్రికి అధికారుల సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సి జన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవ సరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యు లకు నాణ్యమైన వైద్యసేవలు అందించేం దుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆ రోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, సం బంధిత అధికారులకు సిఎం కెసిఆర్ సూ చించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్ర కారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిం చే పరిస్థితులు లేవని సంబంధిత అధికారు లు సిఎంకు వివరించారు. రాష్ట్రంలో కరో నా ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాద న్నారు. బహిరంగ సభలు, ర్యాలీ లు లేకుండా త గు చర్యలు తీ సుకోవాలని అధికారులను ఆయన ఆదే శించారు. కరోనా కేసులు పెరు గుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖ పై సిఎం కెసిఆర్ సోమవారం ప్రగతి భవ న్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మం త్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తరువాయి 9లో

ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్‌సిలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రాం రెడ్డి, శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఎ. జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, అధికారులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సిఎం కెసిఆర్‌కు సంబంధిత అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.

లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సిఎం కు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఆక్సిజన్ ఉత్పత్తిని, టెస్టింగ్ కిట్లను పెంచుకోవాలి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సిఎం ఆదేశించారు.

ఖాళీలు 15 రోజుల్లోగా భర్తీ అవ్వాలి

అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సిఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాలరీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సిఎం అన్నారు.

పాత కలెక్టరేట్ కార్యాలయాలను వినియోగించుకోండి

నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని సిఎం ఆదేశించారు.

మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఆదేశం

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అదేవిధంగా రసూల్ పురలో…-2, ఎల్‌బినగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లో…- కూకట్ పల్లి-, ఉప్పల్, మల్కాజిగిరి, జల్ పల్లి, మీర్ పేట-, ఫీర్జాదీగూడ-, బోడుప్పల్-, జవహర్ నగర్-, నిజాంపేట్‌లో ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

నగర పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు

హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ఇందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో… 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జగిత్యాల, సూర్యాపేట , సిద్ధిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ-, నిర్మల్, మంచిర్యాల-, తాండూర్-, వికారాబాద్-, బోధన్-, ఆర్మూర్, కామారెడ్డి-, సంగారెడ్డి-, జహీరాబాద్-, గద్వాల్-, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్-, బొల్లారం-, అమీన్ పూర్-, గజ్వేల్-, మెదక్‌లో ఒక్కొక్కటి చొప్పున మహబూబ్ నగర్-, నల్గొండ, రామగుండం-, ఖమ్మం, కరీంనగర్-లో రెండు చొప్పున నిజామాబాద్‌లో మూడు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : ఈ నెల 8 నుండి 16 వరకు
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు

మన తెలంగాణ/హైదరాబాద్ ః తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కరోనాపై తెలంగాణ సిఎం కెసిఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారుల నివేదికను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News