Monday, April 29, 2024

యూనివర్శిటీ సభలో జారిపడిన సిఎం నితీశ్

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నా యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో వేదికపై జారి పడ్డారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని ఆయనను పైకి లేవనెత్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం యూనివర్శిటీ క్యాంపస్‌లో కార్యక్రమం జరిగింది. వేదికపై ఉన్న శిలాఫలకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన అటువైపు వెళ్తుండగా అదుపు తప్పి జారిపడ్డారు. అంతకు ముందే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ సంఘటనలో సిఎం నితీశ్‌కు ఎలాంటి గాయాలు తగలలేదు. ఆయన కుంటకుండా మామూలుగానే నడిచి వెళ్లి , మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాథాక్రిష్ణన్ చిత్ర పటానికి పూలదండ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News