Monday, April 29, 2024

సిఎం సహాయనిధి పేదలకు వరం: కడియం

- Advertisement -
- Advertisement -

CM Relief fund help to Poor people

మన తెలంగాణా/జఫర్‌గడ్ : జనగాం జిల్లా జఫర్ గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి)కి చెందిన కూరపాటి రాకేశ్ కు సిఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.60 వేల విలువగల చెక్కును మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండలోని ఆయన నివాసంలో బుధవారం లబ్దిదారునికి అందచేశారు. రాకేశ్ అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మారపెల్లి ప్రభాకర్, కడియం దృష్టికి తీసుకుపోగా ఆయన ప్రత్యేక చొరవతో మంజూరైన చెక్కును బాధితునికి అందచేశారు. సిఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News