Monday, April 29, 2024

పగటి కలలు కనకండి

- Advertisement -
- Advertisement -

పగటికలలు కనకండి… సుస్థిర పాలన అందిస్తాం
గద్దర్ జయంతి సభలో సిఎం

మనతెలంగాణ / హైదరాబాద్ : ఐదారు నెలల్లోనే అధికారంలోకి వస్తామనే పగటి కలలు కొందరు ప్రతిపక్ష నేతలు కంటున్నారని, అలాంటి కలలు కనవద్దని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొం దరు అవాకులు..చవాకులు పేలుతున్నారని, మూడు నెలల్లో,, ఆరు నెలల్లో కెసిఆ ర్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారని ఇలాంటి ఆశలు పెట్టుకోవద్దని హితువుపలికారు.

బుధవారం రవీంధ్రభారతి లో జరిగిన గద్దర్ జయంతి సభలో సిఎం రేవంత్‌రెడ్డి కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రజలు మి మ్మల్ని బొ క్క బోర్ల వేశారని, పడిన బొక్క లే సరికాలేదు, పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పనులు చేస్తే నాదేండ్ల హాయంలో జరిగిన తిరుగుబా టు వస్తుందని హెచ్చరించారు. ఐదు నుంచి పదే ళ్ళు తమ ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News