Monday, April 29, 2024

నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన సమైఖ్యాంద్ర పాలన కంటే అధ్వానంగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లు దాటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి కూడా లేదన్న జీవన్ రెడ్డి కాళేశ్వరం వల్ల రూ. 1.20 లక్షల కోట్ల ఆర్థిక భారం పడిందని లెక్కలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లేదని ఆయన తెలిపారు. మేడిగడ్డ అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News