Monday, April 29, 2024

బిజెపి నేతలంతా రావణుడి పుత్రులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డేపై ప్రతిపక్ష సభ్యులు మంగళవారం లోక్‌సభలో విరుచుకుపడ్డారు. బిజెపి నాయకులను రావణుడి కొడుకులుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌదరి అభివర్ణించడంతో సభలో రభస జరిగింది. ఈరోజు మహాత్మాగాంధీని దుర్భాషలాడారు. శ్రీరాముడి భక్తుడిని అవమానించారు. వాళ్లంతా రావణాసురుడి కొడుకులు అంటూ చౌదరి చేసిన వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు తీవ్రంగా స్పందించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జవాబిస్తూ తామే నిజమైన రామ భక్తులమని చెప్పుకొచ్చారు. తామంతా మహాత్మా గాంధీ అనుచరులమని, మీరంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి నకిలీ గాంధీ అనుచరులంటూ ఆయన ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యులు మహాత్మా గాంధీ అమర్ రహే అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

 

Congress terms BJP leaders as Sons of Ravana, Opposition protests on the controversial remarks of Anantkumar Hegde on Mahatma Gandhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News