Monday, April 29, 2024

రాష్ట్రంలో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా, తెలంగాణలోనూ వారం రోజుల వ్యవధిలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమయింది.

కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు.

వాతావరణంలో మార్పుల కారణంగా జర్వం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో వంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందించేందుకు ఫీవర్ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో కూడా వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో వచ్చే బాధితుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం తెలిపిన కొవిడ్ నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. కొవిడ్ కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News