Saturday, April 27, 2024

పాన్ కోసం ఆస్పత్రి నుంచి తప్పించుకున్న కరోనా రోగి

- Advertisement -
- Advertisement -

Corona patient escape from hospital for paan

లక్నో: పాన్ కోసం కరోనా సోకిన వ్యక్తి ఆస్పత్రి నుంచి పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి పాన్ తినే అలవాటు ఉంది. ఎంత ప్రయత్నించిన పాన్ దొరక్కపోవడంతో ఆస్పత్రి నుంచి సిబ్బంది కళ్లుగప్పి బయటకు వెళ్లిపోయాడు. ఆస్పత్రి ఉన్న ప్రాంతంలో రెడ్ జోన్లు ఉండడంతో పాపులన్నీ మూసివేశారు. గాంధీనగర్‌కు వెళ్లి పాన్ కొనుక్కొని తిన్నాడు. అనంతరం తన బంధువుల ఇంటికి వెళ్లి తనని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాలని అడిగాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News