Monday, April 29, 2024

వయనాడ్ నుంచి సిపిఐ పోటీ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: రారున్న లోక్‌సభ ఎన్నికల కోసం కేరళలోని కీలమైన నాలుగు స్థానాలకు సిపిఐ తన అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అన్నీ రాజాను సిపిఐ ప్రకటించడం తమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి సీనియర్ నాయకుడు,

మాజీ ఎంపి పన్నియన్ రవీంద్రన్‌ను అభ్యర్థిగా సిపిఐ ప్రకటించింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం సోమవారం విలేకరుల సమావేశంలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్కటించారు. త్రిపూర్ నుంచి మాజీ వ్యవసాయ మంత్రి విఎస్ సునీల్ కుమార్, మావెలిక్కర స్థానం నుంచి పార్టీ యువజన విభాగం ఎఐవైఎఫ్ నాయకుడు సిఎ అరుణ్‌కుమార్ పోటీ చేస్తారని విశ్వం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News