- Advertisement -
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్, భారత ఆర్మీ ఏర్పాటులో నేతాజీ పాత్ర కీలకమని మమత పేర్కొన్నారు. నేతాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. సువిశాల దేశానికి ఒకే రాజధాని ఎందుకుండాలి..? అని ఆమె ప్రశ్నించారు. దేశానికి నాలుగు రాజధానులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. నాలుగు ప్రాంతాల్లో పార్లమెంట్ సమావేశాలు జరగాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Declare Netaji birthday as national holiday says Mamata
- Advertisement -