Monday, April 29, 2024

క్యాపిటల్స్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

Delhi capitals won on Chennai super kings

 

చెన్నైకి వరుసగా రెండో ఓటమి

దుబాయి : ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. చెన్నై డుప్లెసిస్ (43), కేదార్ జాదవ్ (26) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో ధోనీ సేనకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు వరుసగా రెండో విజయం అందించారు. కాగా, చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.

అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ మూడు ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో షాతో కలిసి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. మరోవైపు చెలరేగి ఆడిన షా 43 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు సాధించాడు. ఇక రిషబ్ పంత్ ధాటిగా ఆడి స్కోరు పరిగెత్తించాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ ఆరు ఫోర్లతో అజేయంగా 37 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోరును సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News