Sunday, April 28, 2024

పెరిగిన డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Diesel prices increase again in India

న్యూఢిల్లీ: డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారంనాడు లీటర్ డీజిల్‌పై గరిష్ఠంగా 27 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా పెంపుతో లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ.96.68, ఢిల్లీలో రూ.89.07, కోల్‌కతాలో రూ.89.07, హైదరాబాద్‌లో రూ.97.35కు చేరింది. చివరిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ కలిపి సెప్టెంబరు 5న మారాయి. తర్వాత డీజిల్ ధరలను పలుసార్లు పెంచినప్పటికీ పెట్రోల్ ధరలు మాత్రం మారలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు సెప్టెంబరు 5 నుంచి 6-7 డాలర్లు పెరగడం గమనార్హం. అయినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్ ధరల్ని పెంచలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News