- Advertisement -
తలకొండపల్లి: యువకుడు అదృశ్యమైన సంఘటనలో తలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన జంగయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్దవాడైన కుమార్ మేస్త్రీ పనులు చేస్తున్నాడని, రెండవ కుమారుడు రవి పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో రవి(30)కి వివాహ సంబంధాలు చూడాలని నిర్ణయించారని,
ఇందులో భాగానే ఈ నెల 14న రవితో వివాహ సంబంధం విషయమై మాట్లాడేందుకు అతని అన్న కుమార్ వచ్చాడని, బయటకు వెళ్లి వస్తానని చెప్పిన రవి ఎంతకూ ఇంటికి రాలేదని, బంధువుల ఇళ్లవద్ద వెతికినా ఫలితంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తప్పిపోయిన రవి అన్న కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
- Advertisement -