Saturday, April 27, 2024

ఇండోర్ లో కరోనాతో వైద్యుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో కరోనా సోకి వైద్యుడు మరణించారు. కరోనా బాధితుడికి చికిత్స చేస్తూ వైరస్ బారినపడ్డ ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. రాష్ట్రంలో మొత్తం 347 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ఒక్క ఇండోర్ లోనే ఇప్పటి వరకు 151 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 24 మంది మరణించారు. దీంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరుగొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలందరూ సమాజిక దూరం పాటించాలని కోరింది.ఇక, దేశవ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 6,217కు చేరగా.. మృతుల సంఖ్య 184కు చేరింది.

Doctor died due to Corona in Indore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News