Monday, April 29, 2024

తొలి ఏకాదశి… తిరుపతి వెంకన్న సేవలో మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

 

తిరుపతి న్యూస్: నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం వేకువజామునే దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర, భారత దేశ ప్రజలు బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీర్వాదం, అనుగ్రహం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇవ్వాలని, ఆ అనుగ్రహంతో మరెన్నో ప్రజోపయోగ పనులు చేస్తారని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతికి రావడం తనకు ఆనవాయితీ అని, ఆ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News