- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని మాజీ ఎంఎల్సి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హెచ్చరించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. రెండో రోజు జరిగిన సంఘీభావ నిరవధిక ధర్నాను ఆయన ప్రారంభించారు. సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు నిరసిస్తూ చిన్నారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
- Advertisement -