- Advertisement -
ఖమ్మం: పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఖండించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని, అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. వ్యక్తిగత విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ అసాధారణ రీతిలో తనని గౌరవించారని, తాను ఎంఎల్ఎగా ఓడిపోయానా కూడా మంత్రివర్గంలోకి కెసిఆర్ తనని తీసుకున్నారని గుర్తు చేశారు. జిహెచ్ఎంసి, ఖమ్మం మున్సిపాలిటీలో టిఆర్ఎస్ గెలుపుకోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
- Advertisement -